జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు ఫ్యామిలీ, అడివి శేష్, సహా పలువురు సినీ ప్రముఖులు ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోవడంపై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మంగళవారం మధ్యాహ్నం అనంత్నాగ్ జిల్లా పహల్గాం లోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 28 మందిని బలిగొన్న ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత దారుణమైన ఉగ్రదాడి జరగడం ఇదే. ఇక ఈ దాడి ఘటనను ప్రపంచదేశాలు సైతం తీవ్రంగా ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు సంఘీభావం ప్రకటించారు.
ఇక ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న భారత ప్రదహనమంత్రి నరేంద్ర మోదీ విషయం తెలిసిన వెంటనే తన అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానిక విమానాశ్రయంలోనే కేబినెట్ లోని కీలక మంత్రుల సహా ఉన్నతాధికారులతో అత్యవసర మీటింగ్ ఏర్పాటుచేసి పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: