టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్దీప్ హుడా విలన్గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్, టీజర్కి మంచి స్పందన వచ్చింది. ఇదేక్రమంలో నేడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. జైపూర్లో నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సన్నీ డియోల్ సహా చిత్ర యూనిట్ పాల్గొంది. ఓ రైతు నాగలితో పొలాన్ని దున్నుతుండగా డెడ్ బాడీస్ బయటపడడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత విలన్ ఇంట్రడక్షన్ ఒక్కసారిగా హై ఇస్తుంది.
‘ఈ లంకలో అడుగు పెట్టాలంటే ఆ దేవుడు కూడా భయపడతాడు’ అంటూ రెజీనా చెప్పే డైలాగ్ సినిమాలో యాక్షన్ ఎలా ఉండనుందో హింట్ ఇవ్వగా.. ‘ఈ చేతికి ఉన్న పవరేంటో ఇప్పటివరకూ నార్త్ ఇండియా చూసింది, ఇప్పుడు సౌత్ ఇండియా చూడబోతోంది’ అని సన్నీ చెప్పే డైలాగ్ ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ అయితే, జాట్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబి సినిమాటోగ్రఫర్గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేస్తున్నారు. కాగా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 10న హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: