టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శర్వానంద్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. కెరీర్ మొదటినుండీ కూడా శర్వానంద్ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న మనమే సినిమా కూడా ఒకటి ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూాడా మొదలుపెట్టి ఇప్పటికే గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఈసినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే చాలా ఫ్రెష్ గా కలర్ ఫుల్ గా ఉంది. పైకి మంచిగా కనిపించినంత మాత్రం మంచివాళ్లు అయిపోరురా.. నేను చూడు పైకి మంచిగా కనిపిస్తా కానీ కాదు అంటూ శర్వా చెప్పిన డైలాగ్ తో మొదలవుతుంది టీజర్. ఆ తర్వాత కృతిశెట్టి, ఒకచిన్న బాబు ఎంట్రీ ఉంటుంది. ఇక లాస్ట్ లో కృతిశెట్టి శర్వాని తిడుతూ ఇంటిని చూడటం రాదు.. పిల్లాడిని చూడటం రాదు.. ఏంరాదు పిచ్చి పట్టిందా అని అంటుండగా.. దానికి శర్వా ఇద్దరిలో ఒక్కరే ఏడవండి అంటూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. మొత్తంగాా టీజర్ ను బట్టి చూస్తే శర్వా ఈసినిమాలో చాలా స్టైలిష్ లుక్ లో ఇంకా ఎనర్జిటిక్ గా రాబోతున్నాడని అర్థమవుతుంది. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: