టాలీవుడ్ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. తెరపైనే కాదు వెనుక కూడా కీలక పాత్ర పోషించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా మారారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సాయి తేజ్.. ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ ప్రొడక్షన్ హౌస్కు ‘విజయ దుర్గ ప్రొడక్షన్స్’ అని నామకరణం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తేజ్ మాతృమూర్తి పేరు విజయ దుర్గ అన్న విషయం తెలిసిందే. అలాగే ఆమె మెగాస్టార్ చిరంజీవికి స్వయానా చెల్లెలు అన్న సంగతి కూడా అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ అమ్మ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఆయన ప్రొడక్షన్ హౌస్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో తనతో హిట్ సినిమాలు నిర్మించి తన ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన ప్రొడ్యూసర్ దిల్ రాజుకి సాయి ధరమ్ తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఫ్రెండ్ సత్యకి కూడా తేజ్ థ్యాంక్స్ చెప్పారు.
A New beginning ☺️
Happy to announce a small gift to my mother on her name,
Our Production House @VijayaDurgaProd 🥳Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama
& my guru garu @PawanKalyan mamaMy Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024
ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను తేజ్ సోషల్ మీడియాలో పంచుకోగా.. మెగాభిమానులతోపాటు పలువురు నెటిజెన్లు ఆయనకు మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. కాగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ సూర్యదేవర నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ‘గాంజాశంకర్ ఫస్ట్ హై’ పేరుతో యూట్యూబ్లో రిలీజైన వీడియో సూపర్ రెస్పాన్స్ అందుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: