టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లేటెస్ట్ పొలిటికల్ ఎంటర్టైనర్స్ ‘వ్యూహం’, ‘శపథం’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాల విడుదల వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈరోజు ‘వ్యూహం’.. అలాగే మార్చి 1న ‘శపథం’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ రెండు సినిమాల విడుదల నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు విషయాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఎక్స్ వేదికగా వెల్లడించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల కారణంగానే ఈ సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఆర్జీవీ ఈ చిత్రాలకు సంబంధించి కొత్త విడుదల తేదీలను ప్రకటించారు. తాజా ప్రకటన ప్రకారం ‘వ్యూహం’ మార్చి 1న, అదే విధంగా ‘శపథం’ మార్చి 8న విడుదల కానున్నాయి. కాగా పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇక ఈ ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది.
— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2024
కాగా ఈ సినిమాలలో ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ సహా మరికొన్ని కీలక పాత్రలు ఉంటాయని ఆర్జీవీ ఇప్పటికే తెలియజేశారు. దీంతో ఈ చిత్రాలపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ చిత్రాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు 2014-19 మధ్య కాలంలో ఆయన.. ‘పవర్ స్టార్’, ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ మరియు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తదితర చిత్రాలను తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. కాగా ‘వ్యూహం’ చిత్రాన్ని నైజాం ఏరియాలో టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: