శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈసినిమాను ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంత టైమ్ పట్టింది. గత నెలలోనే ఈసినిమాను పూజాకార్యక్రమాాలతో ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను కూడా పూర్తిచేసుకుంది. మొదటి షెడ్యూల్ తిరుపతిలో జరుగగా అక్కడ ధనుష్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆతరువాత గోవాలో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయగా ఆ షెడ్యూల్ లో నాగార్జున, ధనుష్ పై పలుకీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు మూడో షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. హైద్రాబాద్ లోనే థర్డ్ షెడ్యూల్ ను జరపనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో రష్మిక మందన్న కూడా జాయిన్ అవ్వనుందట.
కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: