టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తుంటారు. 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 19ఏళ్లు పూర్తయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్బంగా మహేష్ తన ఇన్ట్సా ద్వారా నమ్రతాకు క్యూట్ విషెస్ ను అందించారు. తమ పాత పిక్ ను పోస్ట్ చేస్తూ పార్టనర్స్ ఇన్ లవ్.. నవ్వుల్లో, జీవితంలో ఎన్నో అందమైన మూమెంట్స్ లో హ్యాపీ యానివర్సరీ నమ్రత అంటూ విష్ చేశారు. ఇక నమ్రత కూడా ఒక ఫొటో షేర్ చేసి.. ఇంకో సంవత్సరం ప్రేమ, సంతోషం నీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇది ఎప్పటికి ఉంటుంది మహేష్ అని పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఇక ఈఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆసినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాగా.. ఈసినిమాలో మహేష్ మేకోవర్, స్టైల్, డైలాగ్స్, ఎనర్జిటిక్ యాక్షన్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు ఎప్పటినుండో మహేష్ ను ఈ యాంగిల్ లో చూడాలనుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. ఈసినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. ఈసినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: