టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ భీమా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది ఈసినిమా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితోపాటు శ్రీనువైట్ల తో కూడా కూడా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే ప్రారంభించారు కూడా. అంతేకాదు ఈమధ్యే ఈసినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ను హిమాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ చేసినట్టు తెలిపాడు శ్రీనువైట్ల. ఇప్పుడు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు. ఎగ్జైటింగ్ హిమాచల్ ప్రదేశ్ షూటింగ్ కంప్లీట్ అయిందని.. ఈసందర్భంగా ఇలాంటి కిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ షూట్ కోసం కష్టపడిన చిత్రయూనిట్ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ పోస్ట్ లో పేర్కొన్నాాడు.
Completed an exciting schedule in Himachal Pradesh for the film with @YoursGopichand
I wholeheartedly thank the entire unit for the outstanding effort under extremely testing weather conditions!! pic.twitter.com/nHtIHyAxqb— Sreenu Vaitla (@SreenuVaitla) February 10, 2024
కాగా శ్రీనువైట్ల ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా.. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దొనెపూడి ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో నటించే ఫీమేల్ లీడ్ ఇతర నటీనటుల గురించి త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: