టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు అయన బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె, అల్లుడు, సోదరుని కుమారుడు, యంగ్ హీరో ఆశిష్ తదితరులు వున్నారు. కాగా ఆశిష్ వివాహం త్వరలో జరుగనున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అద్వైతా రెడ్డి, ఆశిష్లకు గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 14న వీరి వివాహం జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో దిల్ రాజు పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులను కుటుంబంతో సహా వెళ్లి అందరికీ శుభలేఖలు ఇచ్చి వివాహానికి ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆశిష్ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇక కొన్ని రోజుల క్రిత్రమే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరియు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కూడా దిల్ రాజు కలిసి శుభలేఖ అందచేశారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు రాఘవేంద్రరావు ,మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, జూ. ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, రవితేజ, అక్కినేని అఖిల్ తదితరులకు ఆహ్వానాలు అందాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: