టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి తండ్రి అయ్యారు. ఆయన సతీమణి సుజాత సోమవారం ఆడబిడ్డను ప్రసవించారు. కాగా ఈ సంతోషకరమైన వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో ‘విశ్వంభర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష చిరు సరసన కథానాయికగా నటిస్తున్నారు. 18 ఏళ్ల క్రితం చిరుతో కలిసి ‘స్టాలిన్’ సినిమాలో నటించిన ఆమె.. మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్తో కలిసి స్క్రీన్పై సందడి చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న షెడ్యూల్లో చిరంజీవి సహా త్రిషపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్లతో బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: