అయోధ్య రాముడి ఫొటోలు షేర్‌ చేసిన అమితాబ్‌ బచ్చన్‌.. నెట్టింట వైరల్‌

Amitabh Bachchan Shares Ram Lalla Pics During Ayodhya Visit, Goes Viral

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం మరియు రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలు సోమవారం (జనవరి 22, 2024) ప్రధాని మోదీ చేతులమీదుగా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరై శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన శ్రీరాముడిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో పులకించిపోయారు. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు ఆయన తన అధికారిక ఖాతా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో అమితాబ్ బాలరాముడి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. దీనికి “బోల్ సియా పతి రామచంద్ర కీ జై” అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అయోధ్యలో అట్టహాసంగా జరిగిన ‘రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ’ (పవిత్రోత్సవం)కి ఆహ్వానాలు అందుకున్న 7,000 మంది ప్రముఖ అతిథులలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఉన్నారు. ఇక దక్షిణాది నుంచి ఈ ఆహ్వానం అందుకున్నవారిలో ఆయనతోపాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 9 =