తమిళ హీరో ధనుష్ తన 51వ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చేస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతుంది.ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.రష్మిక మందన్న కథానాయకి గా నటిస్తుంది.ఇక ఇప్పుడు మరింత పవర్ ఆడ్ అయ్యింది.ఈసినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.దాంతో సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలోనే ఈసినిమా నుండి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ అలాగే పుస్కూర్ రామ్మెహన్ కలిసి ఈసినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.ఇక ధనుష్ కు తెలుగులో ఇది రెండో స్ట్రెయిట్ సినిమా.ఇంతకుముందు మొదటి సినిమాగా చేసిన సార్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.
ఇదిలావుంటే ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ తెలుగులో ఈనెల 25న విడుదలకానుంది.తమిళంలో ఆల్రెడీ రిలీజ్ అవ్వగా డీసెంట్ హిట్ అనిపించుకుంది.అరుణ్ మతేశ్వరన్ డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: