టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా ‘గుంటూరు కారం’ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. మహేశ్ వన్ మేన్ షోగా నడిచిన ఈ మూవీ టాక్తో సంబంధం లేకుండా విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ పలు రికార్డులు బద్దలు కొడుతోంది. మామూలు కథను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళడంలో ఒక స్టార్ హీరో ఇమేజ్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో.. ‘గుంటూరు కారం’ కలెక్షన్స్తో మహేశ్ బాబు నిరూపించారు. ఆయన ఒంటిచేత్తో ఈ సినిమాను నిలబెట్టారంటే అతిశయోక్తి లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా హీరో మహేశ్ బాబు విదేశాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో మహేశ్తో పాటు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఎయిర్పోర్ట్ వద్దకు వచ్చి ఆయనకు సెండాఫ్ పలికారు. ఈ సందర్భంగా చెక్ ఇన్ పాయింట్ వద్ద మహేశ్ను ప్రేమగా హగ్ చేసుకుని నమ్రత వీడ్కోలు పలికారు. దీనికి సూపర్ స్టార్ నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా మహేశ్ ఇలా విదేశాలకు బయలుదేరడంపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.
#NamrataShirodkar gives send off to Super 🌟 @urstrulyMahesh at Hyd airport as he go on a short trip!📸#MaheshBabu #GunturKaaram #SSMB29 #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/8JOgApySLz
— Telugu FilmNagar (@telugufilmnagar) January 18, 2024
అయితే మహేశ్ తన తదుపరి సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో త్వరలో చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ మూవీ నిమిత్తం విదేశాలకు బయలుదేరారని సూపర్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో, ట్రెజర్ హంట్ నేపథ్యంలో యాక్షన్ ఎడ్వెంచరస్గా ఈ చిత్రం రూపొందనున్నట్లు ఇప్పటికే రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించడం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: