తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు అలానే విజయాలను కూడా అందుకుంటున్నాడు. ఈ ఏడాది అలా స్టార్ట్ అయిందో లేదో అప్పుడే ఒక హిట్ ను అందుకున్నాడు. సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో వచ్చాడు. పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో ధనుష్ తన నటనతో మరో మెట్టు ఎక్కాడు. ఈసినిమా తమిళ్ లో రిలీజ్ అవ్వగా అక్కడ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగులో జనవరి 25వ తేదీన రిలీజ్ కాబోతుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ధనుష్ శేఖర్ కమ్ములతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమాలో నాగార్జున కూడా నటించనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇంతవరకూ ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అయితే ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో ఈసినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నారని కన్ఫామ్ అయిపోయింది. రేపు ఉదయం 11 గంటల7 నిమిషాలకుఈసినిమా జర్నీ స్టార్ట్ అవ్వనుందని తెలియచేస్తూ అధికారికంగా తెలియచేశారు.
𝗜𝘁’𝘀 𝗗𝗡𝗦 𝗱𝗮𝘆 𝘁𝗼𝗺𝗼𝗿𝗿𝗼𝘄 😍
The journey will take off at 11:07AM ❤️🔥#DNS 🧨@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula@AsianSuniel @puskurrammohan @SVCLLP @amigoscreation @UrsVamsiShekar @RIAZtheboss @V4umedia_ pic.twitter.com/ZwdZnJgNpc
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 17, 2024
కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలిపారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఆమధ్య D51 అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇన్ని రోజుల తరువాత ఈ అప్ డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చూద్దాం ఈసినిమా గురించి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: