దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన పిన్ని, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనం తర్వాత జాన్వీ కపూర్, మహేశ్వరిలు రంగనాయకుల మండపంలో పండితుల నుంచి వేదఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘దేవర’ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ టాలీవుడ్లో అడుగుపెడుతుండటం విశేషం. ఇక జనవరి 8వ తేదీన ‘దేవర’ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: