విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. వెంకటేష్ కెరీర్లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 75వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్కు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ‘సైంధవ్’ చిత్రంలో ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషించారు. అన్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున చిత్రబృందం ప్రమోషన్స్ను ముమ్మురం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్, పాటలు రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో నేడు, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ .. “వెంకటేష్ గారి 75వ చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటేష్ గారికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు. నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు. ట్రైలర్లో కథ చెప్పేశాను. ఇంత ధైర్యంగా కథ చెప్పానంటే సినిమా లోపల ఎంత వుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. వెంకీ గారు నాలుగు అడుగులు వేస్తేనే ఆడియన్స్ అరుస్తున్నారు. థియేటర్లో ఇంకేం చేస్తారేమో అని భయం వేస్తుంది (నవ్వుతూ). వెంకటేష్ గారు నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చారు. ఇది నా బెస్ట్ ఫిల్మ్. నాకు వచ్చిన ఫిల్మ్ మేకింగ్ అంతా వాడేశాను” అని తెలిపారు.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “హాలీవుడ్లో ఈక్వైలైజర్, టేకెన్ లాంటి సినిమాలు చూస్తున్నపుడు మన తెలుగులో కూడా ఆ ఏజ్ గ్రూప్ హీరోలు ఆ తరహ సినిమాలు చేస్తే యంగర్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కదా అనిపించేది. అలాంటి సమయంలో వెంకీగారు పిలిచి ఈ అవకాశం ఇచ్చారు. వెంకటేష్ గారు ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. తప్పకుండా అందరూ సినిమా చూడండి. వెంకీ 75వ చిత్రాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్ గారికి ధన్యవాదాలు. మా టీం అందరికీ థాంక్స్. వెంకీ మామ సినిమా అంటేనే పండగ. ఈ పండక్కి ‘సైంధవ్’ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని డైరెక్టర్ శైలేష్ కొలను కోరారు.
కాగా ‘సైంధవ్’ చిత్రంలో బేబీ సారా, కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా సైంధవ్ చిత్రం జనవరి 13న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: