c కాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గతవారం జూ. ఎన్టీఆర్ కుటుంబసమేతంగా జపాన్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న అర్ధరాత్రి తిరిగి ఇండియా చేరుకున్నారు. ఈ సందర్భంగా తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు సోమవారం (జనవరి 1) అర్ధరాత్రి దాటిన తర్వాత తారక్ తెలిపాడు. ఈ మేరకు ఆయన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“జపాన్ నుంచి ఈరోజే ఇంటికి తిరిగి వచ్చేశాను. అక్కడి భూకంపాల వార్తలు చూసి షాక్ అయ్యాను. మేము గత వారం రోజులుగా అక్కడే గడిపాం. భూకంపాల వల్ల ప్రభావితమైన ప్రతిఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ఎంతో ధైర్యంగా ఉన్నారు. జపాన్ ప్రజలు ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని తారక్ ట్వీట్ చేశాడు. దీంతో జూనియర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఎన్టీఆర్ చేసిన ట్వీట్ను పెద్దఎత్తున రీట్వీట్ చేస్తున్నారు.
Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵— Jr NTR (@tarak9999) January 1, 2024
ఇదిలా ఉండగా మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా దేవర సినిమా మేకర్స్ ఎన్టీఆర్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసి ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మూవీ నుంచి జనవరి 8న గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా వారు వెల్లడించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: