టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా” తర్వాత దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో ‘గుంటూరు కారం’ మూడో సినిమాగా వస్తోంది. దీంతో ఈ చిత్రంపై ఇటు మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం వారు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ‘గుంటూరు కారం’ నుండి ఇప్పటికే పలు పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ధమ్ మసాలా’ మరియు ఓ మై బేబీ అనే సాంగ్స్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘ధమ్ మసాలా’ సాంగ్ యూట్యూబ్లో సెన్సేషన్ సృషించింది. విడుదలైన 24 గంటల్లోనే 19.2 మిలియన్ల వ్యూస్ పైగా సాధించి రికార్డ్ సృష్టించింది. తద్వారా ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ సాధించి టాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచింది. ఈ నేపథ్యంలో అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.
Hyping up your new year!! Here’s the promo of #KurchiMadathapetti#TrivikramSrinivas @MusicThaman @sreeleela14 @Meenakshiioffl #RamajogayyaSastry @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th pic.twitter.com/tP9HPN8TvA
— Mahesh Babu (@urstrulyMahesh) December 29, 2023
గుంటూరు కారం నుంచి ఫుల్ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఈ పాటను ఈ మేరకు శుక్రవారం హీరో మహేష్ బాబు తన అధికారిక ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో మారుమ్రోగుతోంది. ఇక పాటకు థమన్ అందించిన మాస్ బీట్ మ్యూజిక్ లవర్స్ని ఉర్రూతలూగిస్తోంది. కాగా దీనికి సంబంధించి ఫుల్ సాంగ్ రేపు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సో.. మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ ఫర్ ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్.
కాగా ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. నాగవంశీ, హారిక సూర్యదేవర సమర్పిస్తున్నారు. కాగా ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మధి కెమెరామెన్గా, నవీన్ నూలి ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: