సీనియర్ హీరో వెంకటేష్ ఎట్టకేలకు మళ్ళీ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నాడు.2021లో నారప్ప,దృశ్యం 2 సినిమాల్లో నటించాడు వెంకీ.అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల ఆ రెండు కూడా డైరెక్ట్ గా ఓటిటి లోనే విడుదలయ్యాయి.దాంతో ఫ్యాన్స్ నిరాశకుగురయ్యారు.తమ అభిమాన హీరోను డైరెక్ట్ గా థియేటర్లో చూసుకొని చూసి చాలా రోజులవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సైంధవ్ ఆలోటు తీర్చనుంది.వెంకీ 75వ సినిమాగా వస్తున్నఈసినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది.ఇక ఈసినిమా రెండవ సాంగ్ సరదా సరదాగా రిలీజ్ అయ్యింది. ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ డీసెంట్ గా వుంది.
హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్,ఆండ్రియా జెర్మియా ,రుహాణి శర్మ ,ఆర్య ,నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఫై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు.వెంకీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో వస్తుంది.జనవరి 13న సైంధవ్ పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: