శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే కదా. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మధుర్ మిట్టల్ ప్రధాన పాత్రలో ఈసినిమా వచ్చింది. ఇక ఈమధ్యే ఈసినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈసినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ ను రాలేదు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోని తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈసినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Witness the incredible true story of Muthiah Muralidaran, the man who redefined the game of cricket!… pic.twitter.com/3U9q2we5p0
— Movie Train Motion Pictures (@MovieTrainMP) November 14, 2023
కాగా మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాను మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా..ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. ఇక సినిమాకు ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: