టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవలే ‘స్కంద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ మూవీలో రామ్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్లో కనిపించి అలరించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించాడు. కాగా రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి రామ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొన్ని రోజులుగా ‘స్కంద’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న రామ్ పోతినేని రీసెంట్గా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ షూటింగ్ కోసం తిరిగి వచ్చాడు. ఈ మేరకు రామ్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలియజేశాడు. ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ ఒక పోస్ట్ పెట్టి వెల్లడించాడు. ఇక అందులో రామ్ ముఖం సగం వరకే కనిపిస్తుండగా.. కండలు తిరిగిన అతని బాడీని చూపించాడు. కాగా ఈ మూవీ కోసం రామ్ ప్రత్యేకంగా స్టైలిష్ మేకోవర్ అవడం విశేషం. ఇక రామ్, పూరీ కలయికలో 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబోలో ఆ సినిమాకి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందుతోంది.
I’M BACK!
-Ustaad #DOUBLEiSMART Shankar pic.twitter.com/jgo6u9UNDR
— RAm POthineni (@ramsayz) November 1, 2023
ఇక పూరీ జగన్నాథ్ దీనికిముందు విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో ఎలాగైనా ‘డబుల్ ఇస్మార్ట్’తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అలాగే రామ్ పోతినేని కూడా ‘స్కంద’ సినిమా మిగిల్చిన చేదు అనుభవాన్ని ఈ మూవీ సక్సెస్ ద్వారా అధిగమించాలని చూస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో గత కొన్నిరోజుల క్రితం విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తన నటీనటులను బెస్ట్ మాస్ అప్పీలింగ్లో ప్రజంట్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’లో.. సంజయ్ దత్ను మునుపెన్నడూ చూడని అవతారంలో చూపించనున్నారు.
అలాగే రామ్ మరియు సంజయ్ దత్లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎక్సయిటింగ్గా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వైల్డ్ కాంబినేషన్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా ఈ క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ను పూరి కనెక్ట్స్ బ్యానర్పై డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి-నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్తో రూపొందుతోంది. ఇక ఈ క్రేజీ ఎంటర్టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తుండటం గమనార్హం. అలాగే స్టంట్ డైరెక్టర్ కేచ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: