మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి షురూ అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరియు నటి లావణ్య త్రిపాఠిల వివాహం మరో మూడు రోజుల్లో జరుగనుంది. నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ గ్రాండ్గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరవనున్నారు. దీనిలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా ఇటలీకి పయనమవగా.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కుటుంబంతో సహా ఇటలీకి బయలుదేరారు. ఈ క్రమంలో తన సతీమణి స్నేహారెడ్డి మరియు పిల్లలతో కలిసి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోగా.. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ వివాహ వేడుక కోసం వరుణ్ తేజ్, తన సోదరి నిహారిక కొణిదెల మరియు కాబోయే భార్య లావణ్య త్రిపాఠిలతో కలిసి శుక్రవారమే ఇటలీకి పయనమయ్యారు. వీరితో పాటు మరికొంతమంది మెగా కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారని, మిగతా వాళ్ళు కూడా ఈరోజు, రేపట్లో చేరుకుంటారని తెలిసింది. కాగా వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ సహా అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. ఇక ఇటలీలో వివాహ వేడుక తరువాత, నవంబర్ 5వ తేదీన తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్యుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన సంగతే. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఇప్పుడు ఇటలీలో వివాహం జరగబోతోంది.
ఇక ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే, ఇటీవలే ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే మూవీలో నటిస్తున్నారు. భారతీయ వాయుసేనలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్గా నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్పై సందీప్ ముద్దా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 8న ‘ఎయిర్ ఫోర్స్ డే’ సందర్భంగా విడుదల కానుంది. అలాగే ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే సినిమాను చేస్తున్నాడు వరుణ్ తేజ్.
మరోవైపు అల్లు అర్జున్ ‘పుష్ప – 2’ సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప – ది రైజింగ్’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్గా నటిస్తున్నారు. కాగా ఇటీవలే ‘పుష్ప – ది రైజింగ్’ చిత్రంలోని తన నటనకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు పురస్కారాన్ని సైతం గెలుపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. అలాగే త్వరలోనే అల్లు అర్జున్ విగ్రహాన్ని దుబాయ్లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించనుండటం గమనార్హం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: