‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో తనను శాశ్వత ‘ఖైదీ’ని చేసిందని, తన జీవితంలో ఆ చిత్రం ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి. కాగా నేటితో ఆ చిత్రం విడుదలై 40 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చిరంజీవి దీనికి సంబంధించి తన భావాలను పంచుకున్నారు. ‘ఖైదీ’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిదని చెప్పిన ఆయన, అందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన నటీ, నటులకు మరియు టెక్నీషియన్లను అభినందనలు తెలియజేశారు. ‘ఖైదీ’ చిత్ర దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి గారికి, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్కి, కథా రచయితలు పరుచూరి సోదరులకు, అలాగే సినిమాలో తనకు కో- స్టార్స్గా నటించిన హీరోయిన్స్ సుమలత మరియు మాధవి తదితరులకు స్పెషల్ విషెస్ చెప్పారు. కాగా మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది.
నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి
ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ,
ఆ చిత్ర… pic.twitter.com/raY4AOTAoH— Chiranjeevi Konidela (@KChiruTweets) October 28, 2023
కాగా 1983వ సంవత్సరం అక్టోబర్ 28న విడుదలైన ‘ఖైదీ’ సినిమా చిరంజీవి నట జీవితాన్ని మలుపు తిప్పింది. తొలుత చిన్న చిన్న వేషాలతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తరువాత నెగటివ్ క్యారక్టర్లలో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం మొదట్లో ఇద్దరు, ముగ్గురు కథానాయకులు ఉన్న సినిమాలలో నటిస్తూ.. తనదైన ప్రతిభతో అతిత్వరలోనే సోలో హీరోగా నటించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చేసిందే ‘ఖైదీ’ చిత్రం. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. తద్వారా ఇండస్ట్రీలో చిరంజీవి ప్రత్యేక గుర్తింపు పొందారు. అక్కడినుంచి చిరంజీవి ఒక్కోమెట్టు ఎక్కుతూ అచిరకాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరో స్థానానికి చేరుకున్నారు.
అయితే ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక కొత్త సినిమా (#మెగా156)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్రెడ్డి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) కాన్సెప్ట్తో సోషియో ఫాంటసీగా రూపొందనున్న ఈ మెగా156 మూవీ చిరంజీవి కెరీర్లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ చిత్రంగా వుండబోతోంది. ఇటీవలే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమవ్వగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: