బిగ్ బాస్ 7- శోభా రచ్చ..ప్రశాంత్ ఏడుపు

bigg boss season 7 telugu day 53 highlights

బిగ్ బాస్ 7.. హౌస్ లో ఎనిమిదో వారం కూడా పూర్తి కావస్తుంది. చూస్తుండగానే వీకెండ్ వచ్చేసింది. ఇక ప్రస్తుతం అయితే హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. బీబీ మారథాన్ పేరుతో టాస్క్ లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ముందుగా రిజల్ట్ ఏంటో గెస్ చేయాలి అంతే అనే టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్. ప్రియాంక, శోభ, అమర్ దీప్, తేజ పాల్గొనగా ప్రియాంక ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. ఇక రెండో టాస్క్ గా డబ్బాలు సెట్ చేయాలంతే? అనే గేమ్ ను పెట్టగా ఈ గేమ్ లో ప్రశాంత్, యావర్, గౌతమ్, రతిక పాల్గొనగా ఈగేమ్ లో ప్రశాంత్ గెలవగా, ఆతర్వాత యావర్, గౌతమ్ 2,3స్థానాలను దక్కించుకన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిన్న ఎపిసోడ్ లో స్టోర్ ఇట్, పోర్ ఇట్ అనే టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా షవర్ తో వచ్చే నీళ్లను తలపై ఉన్న స్పాంజిలో నింపుకొని ఆతరువాత తమ కంటైనర్లలో నింపుకోవాలి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు మళ్లీ బిగ్ బాస్. బజర్ కొట్టిన ప్రతిసారి ఒకరు గేమ్ నుండి తప్పుకోవాలి.. అయితే గేమ్ నుండి తప్పుకునే ముందు తమ నీళ్లను వేరే వాళ్లకు ఇవ్వొచ్చు. ఈ గేమ్ లో అర్జున్, అశ్విని, సందీప్, భోలే పాల్గొన్నారు. ఫైనల్ గా సందీప్ కెప్టెన్ కంటెండర్ అయ్యాడు.

మరోవైపు గేమ్ లో తనకు సరైన సపోర్డ్ రాకపోవడంతో ఫీలవుతాడు అర్జున్. ఇంతకు ముందు నో మాస్టర్ అనేవాళ్లు ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారు అని శివాజీతో అనగా.. అందుకు శివాజీ అవన్నీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటాడు. ఇంకోవైపు మళ్లీ రతిక, ప్రశాంత్, యావర్లు గతంలో జరిగిన విషయాల గురించి చర్చించుకుంటారు. ప్రశాంత్ తో తనను అక్కా అనొద్దు అని చెబుతుంది. ఇంతకు ముందు అన్నప్పుడు ఏం అనలేదు.. ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నావు అంటూ గతంలో ఇద్దరి మధ్య వచ్చిన ఇష్యూష్ ను తలచుకొని కంటతడిపెడతాడు. పక్కనే ఉన్న యావర్ తనను ఓదార్చుతాడు.

అనంతరం ఎంప్టీ ద కంటైనర్ అనే టాస్క్ ను ఇచ్చాడు అయితే ఈ టాస్క్ లో నేను కూడా ఆడతా.. నన్ను ఆడనివ్వకపోతే ఇంకెవరినీ ఆడనివ్వను అంటూ హడావుడి చేసింది. దీంతో చేసేది లేక శోభా కు ఛాన్స్ ఇచ్చారు. అలా ఈ గేమ్ లో శోభా తో పాటు శివాజీ, అశ్విని, గౌతమ్ లు పాల్గొంటారు. ఈ గేమ్ లో గౌతమ్ గెలుస్తాడు. ఆ తరువాత వేర్ ఇట్ విన్ ఇట్ అనే గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్ లో శోభా, యావర్, తేజ పాల్గొనగా శోభాకు ప్రియాంక, తేజకు అమర్, యావర్ కు ప్రశాంత్ సపోర్ట్ చేస్తారు. ఇక ఈ గేమ్ లో శోభా గెలుస్తుంది.

ఫైనల్ గా అన్ని టాస్క్ లు పూర్తయిన అనంతరం ప్రియాంక, ప్రశాంత్, శోభా, సందీప్, గౌతమ్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. మరి వీరిలో ఫైనల్ గా కెప్టెన్ అయ్యేది ఎవరో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ వెళ్లాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + sixteen =