బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ మొదలై నిజంగానే ఊహకు అందని విధంగా వెళుతుంది. అలా మొదలై ఐదు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ఇక ఐదు వారాల్లో ఐదుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. అయితే ప్రతి సీజన్ లో ఉండేలా ఈసీజన్ లో కూడా సీక్రెట్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక ఈసారి ఈ సీక్రెట్ రూమ్ లో ఉండే ఛాన్స్ ను గౌతమ్ కొట్టేశాడు. ఇంటిలో ఉండటానికి అనర్హులు ఎవరు ఉంటూ ముగ్గురు సభ్యుల పేర్లు చెప్పమని నాగార్జుజ అడుగగా.. అందరూ ఎవరి తోచిన సభ్యులను వారు బోర్డు పై పెట్టారు. అయితే ప్రేక్షకుల దృష్టిలో బోటమ్ 3 వేరే ఉన్నారు అంటూ వారు తేజ, గౌతమ్, శుభ శ్రీ అని చెబుతూ అందులో భాగంగా నిన్న ముందుగా శోభశ్రీ ని ఎలిమినేట్ చేశారు. ఇక మిగిలిన తేజ, గౌతమ్ లలో ఒకరి ఎంచుకోమని హౌస్ మేట్స్ ను అడుగగా అందులో మ్యాగ్జిమమ్ గౌతమ్ ను అనర్హుడని ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చి గౌతమ్ ను సీక్రెట్ రూమ్ కు పంపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బిగ్ బాస్ 7 లో 2.0 మొదలుపెట్టారు. ఈ 2.0లో మరో ఐదుగురు కంటెస్టెంట్లు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. ఈ 2.0 లో మొదటిగా పలు సీరియల్స్ ఇంకా షోస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అంబటి అర్జున్ హౌస్ లోకి ఎంట్రీ. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు కొత్త వాళ్లకు ఒకటాస్క్ ఇచ్చాడు నాగార్జున. హౌస్ లో ఎవరు దమ్ముగా ఆడుతున్నారు.. ఎవరు దుమ్ముగా ఆడుతున్నారు అని అడుగాడు. ఈ గేమ్ లో భాగంగా ముందుగా వచ్చిన అర్జున్ దమ్ముగా ప్రశాంత్, యావర్ ఆడుతున్నారని.. దుమ్ముగా అమర్, సందీప్ ఆడుతున్నారని..అమర్ అసలు ఇలా ఆడతాడని అనుకేలేదని.. ప్రశాంత్ ముందు రతిక బిడ్డ అయ్యాడు ఇప్పుడు శివాజీ బిడ్డ అయ్యాడు.. శివాజీ గారు కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్టు ఆడుతున్నారు.. అది హౌస్ మేట్స్ కు అర్దం కావట్లేదు అని చెప్పాడు. నేను హౌస్ లో పోటీ పడేది ప్రశాంత్, ప్రిన్స్ , శివాజీ అని చెప్పేశాడు.
రెండో కంటెస్టెంట్ గా అశ్వినీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె దమ్ము కేటగిరీలో ప్రశాంత్, శివాజీని.. దుమ్ము కేటగిరీలో ప్రియాంక, శోభాశెట్టిని పెట్టింది. మూడో కంటెస్టెంట్ గా భోళే షావళి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీలోనే నాగార్జున మీద ఒక పాట కూడా పాడి తను పాటబిడ్డను అని..హౌస్ లో రైతు బిడ్డ ఉన్నాడు..నేను పాటబిడ్డను అంటూ చెప్పుకొచ్చాడు. ఈయన దమ్ము కేటగిరీలో ప్రశాంత్, శివాజీని దుమ్ము కేటగిరీలో అమర్ దీప్ ను పెట్టాడు. నాలుగో కంటెస్టెంట్ గా పూజా మూర్తి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే నెలరోజుల ముందే తన తండ్రి చనిపోయారని ఎమోషనల్ అవుతూ తన తండ్రి ఆఖరి కోరికను తీరుస్తానని చెప్పింది. ఇక పూజా మూర్తి దమ్ము కేటగిరీలో శివాజీ, సందీప్ ను దుమ్ము కేటగిరీలో తేజ ను పెట్టింది. ఫైనల్ గా ఐదో కంటెస్టెంట్ గా సోషల్ మీడియాలో రీల్స్ ద్వాారా ఈ తరువాత పలు షోస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయని పావని ఎంట్రీ ఇచ్చింది. ఆమె దమ్ము కేటగిరీలో ప్రశాంత్, యావర్ అని దుమ్ము కేటగిరీలో అమర్ దీప్, తేజ అని చెప్పింది.
మరి చూద్దాం ఇప్పుడు అసలైన్ పోరు మొదలవ్వబోతుందని అర్థమవుతుంది. ఇప్పటికే 5వారాలు ఉన్న హౌస్ మేట్స్ కు .. కొత్తగా వచ్చిన హౌస్ మేట్స్ కు పెద్ద వార్ జరిగేలా కనిపిస్తుంది. చూడాలి వచ్చే ఎపిసోడ్స్ ఎంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయో…
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: