‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన గొప్ప మల్టీ స్టారర్ చిత్రాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోలైన వెంకటేష్ మరియు మహేష్ బాబు ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం కావడం ఒక విశేషమైతే.. ఇందులో వెంకటేష్, మహేష్ సోదరులుగా నటించడం మరో విశేషం. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలకు పేర్లు లేకపోవడం ఆశ్చర్యకర విషయం. సినిమా ఆసాంతం వీరిని పెద్దోడు, చిన్నోడు అనే ట్రీట్ చేయడం గమనార్హం. ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో వస్తుంటే.. ప్రేక్షకులు అలా చూస్తుండిపోతారు. మంచి కుటుంబ నేపథ్యమున్న కథ, మాటలతో పాటు సాంగ్స్.. అన్నీ ప్రేక్షకులను బాగా అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే విషయం చర్చకు వచ్చింది. దీనిపై ఆ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల స్పందించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పెదకాపు-1’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. సదరు జర్నలిస్ట్ దీనికి సంబంధించి ప్రశ్న అడిగాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల సీక్వెల్ అంశంపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘సీతమ్మ వాకిట్లో’ సినిమాకి నేటివిటీ, సాంస్కృతిక నేపథ్యమే బలం. అలాంటి క్లాసిక్కి సీక్వెల్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఇప్పటికే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి చేసిన ప్రయోగం ఇది అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇటీవలే నిర్మాత దిల్ రాజు గారు ఈ ఆలోచనను నాతో పంచుకున్నారు. ఆయనకు వేకువఝామున 4 గంటలకు వచ్చిన ఐడియాను నాకు తెలిపారు. ‘సీతమ్మ వాకిట్లో’ సినిమాకి పార్ట్ 2 చేద్దాం, ప్రిపేర్ అవ్వు అని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే..? మరోసారి ఆ కాంబినేషన్ సెట్ అవ్వాలి, మొదటి భాగానికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా కథ కుదరాలి. ఇవన్నీ వర్కవుట్ అయితే చేద్దామని నేను ఆయనతో చెప్పను. ఎందుకంటే..? దిల్ రాజు గారికి ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే బలమైన కోరిక ఉంది. ఈ విషయంలో నాకంటే ఆయన ఎంతో లోతుగా ఆలోచిస్తున్నారు” అని శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు.
అలాగే శ్రీకాంత్ అడ్డాల ఇలా అన్నారు.. “అయితే అప్పట్లో ఇద్దరు స్టార్ హీరోలతో ఈ చిత్రం చేయడానికి నాకు నాలుగేళ్లు పట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరు హీరోలు తమ తదుపరి ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. మళ్ళీ వీరి కాంబినేషన్ కుదరాలంటే చాలా కష్టం. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేం. ఈ విషయాలన్నింటిపై ఆలోచన చేస్తున్నాం” అని చెప్పారు. సో.. అన్నీ కుదిరితే త్వరలోనే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. వెంకటేష్, మహేష్ బాబు అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులు అందరూ మరోసారి థియేటర్ల వద్ద బారులు తీరడం పక్కా.. ఇది జరగాలనే కోరుకుందాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: