బిగ్ బాస్ 7 మూడో వారం నామినేషన్స్ ఫైర్.. ఎవరు అర్హులు?

bigg boss telugu season 7 3rd week nominations on fire

బిగ్ బాస్ సీజన్ 7 లో మొత్తానికి రెండు వారాలు పూర్తయిపోయింది. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో షకీలా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. ఇక మూడో వారంలోకి అడుగుపెట్టేశారు హౌస్ మేట్స్. అయితే సోమవారం ఎపిసోడ్ లో డైరెక్టర్ గా నామినేషన్ ప్రక్రియలోకి వెళ్లిపోయాడు బిగ్ బాస్. హౌస్ లో ఉండటానికి అనర్హులు ఎవరో చెపుతూ ఇద్దరిని నామినేట్ చేయమని చెపుతాడు బిగ్ బాస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నామినేషన్ ప్రక్రియలో మొదటవచ్చిన ప్రియాంక ప్రిన్స్, యావర్ ను నామినేట్ చేసింది. ప్రిన్స్ కు బిగ్ బాస్ ఒక ఆర్డర్ వేసినప్పుడు మనం దానిని పాటించాలని.. మనకు ఇచ్చిన బెడ్స్ పైనే మనం పడుకోవాలని.. నువ్వు మాట్లాడే విధానం బాలేదని చెప్పింది. గౌతమ్ కు హౌస్ లో పనులు కూడా చేయాలని నామినేట్ చేసింది. ఇక ఆతరువాత వచ్చిన ప్రశాంత్ ఫస్ట్ తేజను తరువాత దామినిని నామినేట్ చేశాడు. శోభాశెట్టి వచ్చి ఫస్ట్ శుభ శ్రీ ని నామినేట్ చేస్తూ అందరితో మంచిగా ఉంటూ నామినేషన్స్ లోకి రావట్లేదు అంటూ.. పనులు తక్కువగా చేస్తున్నావు అంటూ నామినేట్ చేసింది. దానికి శుభ శ్రీ అందరితో మంచిగా ఉండటం తప్పా అంటూ కౌంటర్ ఇచ్చింది. నేను చాలా పనులు చేస్తున్నాను అంటూ ఇద్దరూ చాలా సేపు వాదనకు దిగారు. ఆతరువాత వచ్చిన అమర్ దీప్.. గౌతమ్, శుభ శ్రీ ని నామినేట్ చేశాడు. రతిక.. శుభ శ్రీ, గౌతమ్ ను అలానే తేజ.. ప్రశాంత్, గౌతమ్ ను ప్రిన్స్ యావర్.. ప్రియాంక, దామినిని దామిని ప్రిన్స్ యావర్, శుభశ్రీ ని గౌతమ్.. రతిక, అమర్ దీప్ ను శుభ శ్రీ.. తేజ, ప్రియాంక ను నామినేట్ చేశారు.

నామినేషన్ ట్విస్ట్

ఇక నామినేష్స్ పూర్తయిన తరువాత ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతిక, గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ, దామిని, టేస్టీ తేజ నామినేట్ అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. నామినేట్ అయిన వారి నుండి ఒకరిని సేవ్ చేస్తూ నామినేట్ అవ్వని వారిని స్వాప్ చేయమని పవరాస్త్రను గెలుచుకున్న సందీప్ ను అలానే శివాజీని కోరతాడు. ఇక సందీప్, శివాజీ డిస్కస్ చేసి అమర్ దీప్ ను నామినేట్ చేస్తూ తేజను సేవ్ చేశారు. దీంతో అమర్ దీప్ కాస్త అసహనానికి గురవుతాడు. ఫైనల్ గా అమర్ దీప్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతిక, గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ, దామిని నామినేషన్స్ లోకి వచ్చారు.

బిగ్ బాస్ ట్విస్ట్

ఇక హౌస్ మేట్స్ రిలాక్స్ అవుతుండగా మళ్లీ బిగ్ బాస్ కొత్త ట్విస్ట్ తో వచ్చి షాకిచ్చాడు. మూడో వారం పవరాస్త్ర కోసం అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను బిగ్ బాస్ ఎంపిక చేశాడు. ఇక వీరి ముగ్గురిని బిగ్ బాస్ ఎంపిక్ చేయడంతో హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్ లో చాలామంది నిరాశ చెందారు. ఇక వీరి ముగ్గురిలో ఎవరు అర్హులో కన్ఫెషన్ రూమ్ కి వచ్చి తమ కారణాలు చెప్పాలంటూ బిగ్ బాస్ ఆదేశిస్తాడు. అందులో శోభా శెట్టి పేరును పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ చెప్పగా.. ప్రిన్స్ యావర్ పేరును రతికా రోజ్, దామిని, తేజలు చెప్పారు. ప్రియాంక జైన్.. అమర్ దీప్, శోభా శెట్టి ఇద్దరి పేర్లు చెప్పింది. దీంతో ఎక్కువ ఓట్లు శోభాకే పడినట్లైంది.

మళ్లీ ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చి షాకిచ్చాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అనర్హుల గురించి చెప్పిన వీడియోలను హైస్ మేట్స్ కు చూపించాడు. అయితే ఇక్కడే ప్రిన్స్ చాలా హంగామా చేశాడు. దానికి కారణం రతిక. ముందు పవరాస్త్ర తనకు వస్తే చాలా హ్యాపీ అని చెప్పి లోపల అనర్హుడిగా చెప్పడంతో ప్రిన్స్ హర్ట్ అయ్యాడు.

మరి మొదటి వారం పవరాస్త్రను సొంతం చేసుకొని సందీప్ ఇంటి సభ్యుడవ్వగా.. సెకండ్ వీక్ శివాజీ పవరాస్త్రను గొలుచుకున్నాడు. మరి ఈ వారం ఎవరు పవరాస్త్రను గెలుచుకొని ఇంటి సభ్యుడవుతాడో.. అందుకు బిగ్ బాస్ ఎలాంటి గేమ్స్, ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =