ఈమధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే కదా. ఎంతోమంది లెజెండరీ నటీనటులను పలు ఇండస్ట్రీలు కోల్పోయాయి. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన మరిముత్తు నేడు హఠాన్మరణం చెందారు. మరిముత్తు ప్రస్తుతం ఎథిర్ నీచల్ అనే పేరుతో టెలివిజన్ లో ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ షో డబ్బింగ్ నిమిత్తం స్టూడియోకు వెళ్లారు. ఇక అక్కడ డబ్బింగ్ చెబుతున్న సమయంలో సడెన్ గా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. హాస్పిటల్ కు తీసుకెళ్లే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్టు తెలుస్తంది. ఇక మరిముత్తు మరణం తమిళ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. సెలబ్రిటీలు ఆయన మృతిపట్ల సంతాపం తెలియచేస్తున్నారు. అంత్యక్రియలు ఆయన స్వస్థలంలో నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 2008లో కన్నుమ్, కన్నుమ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు మరిముత్తు. ఒకవైపు దర్శకుడిగా పనిచేస్తూనే, మరోవైపు నటుడిగా పలు సినిమాల్లో నటించారు. వాలి, జీవ, పరియేరుమ్ పెరుమాళ్ సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయన చివరిగా కనిపించిన సినిమా రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా. ఆయనకు భార్య భాగ్యలక్ష్మీ, పిల్లలు అఖిలన్, ఐశ్వర్య ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: