ఉస్తాద్ రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కంద.3 రోజుల క్రితం విడుదలైన ఈసినిమా ట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ ను రాబట్టుకొని సినిమా కు భారీ హైప్ తెచ్చింది. ఇక ఈసినిమానుండి ఇప్పటివరకు రెండు సాంగ్స్ విడుదలకాగా రెండు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఇప్పుడు మూడో సాంగ్ కూడా విడుదలైయింది.డుమ్మారే డుమ్మా అంటూ సాగే ఈసాంగ్ ను కళ్యాణ్ చక్రవర్తి రచించగా అర్మాన్ మాలిక్ ,అయాన్ ప్రణతి పాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పల్లెటూరు గొప్పతనం గురించి వర్ణిస్తూ సాగే ఈసాంగ్ ను రామ్ ,సయీ మంజ్రేకర్ లపై చిత్రీకరించారు.ఇక ఈసినిమా దక్షిణాది భాషల శాటిలైట్ డిజిటల్ రైట్స్ భారీ ధర పలుకాయని సమాచారం.స్టార్ గ్రూప్ ఈ హక్కులను దక్కించుకుంది.రామ్,బోయపాటి కెరీర్ లో హైయెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా స్కంద రికార్డు సృష్టించింది.
ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీ లీల ,సయీ మంజ్రేకర్ లు హీరోయిన్లుగా నటించగా తమన్ సంగీతం అందిస్తున్నాడు,జీ స్టూడియోస్,శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. వచ్చే నెల 15న పాన్ ఇండియా మూవీ గా స్కంద థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: