నటి సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉందని అన్నారు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఆయన మంగళవారం (ఆగస్టు 15, 2023) హైదరాబాద్లో జరిగిన ‘ఖుషి’ మూవీ మ్యూజికల్ కాన్సర్ట్లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసి ‘ఖుషి’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ‘ఖుషి’ మూవీ మ్యూజికల్ కాన్సర్ట్లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న నా తరుపున ఖుషి తీసుకొస్తున్నా. చివరిగా అందరికీ ఖుషి ఎప్పుడు ఇచ్చానో.. మీ అందరూ నవ్వుతూ బయటికి వచ్చిన సినిమాను ఎప్పుడు అందించానో గుర్తులేదు. నాకు కూడా నవ్వులు చుడాలని ఉంది. ముఖ్యంగా ఈ నవ్వులు సమంత ముఖంపై చూడాలని ఉంది. ఎందుకంటే.. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. గతేడాది ఏప్రిల్ నెలలో మేము షూటింగ్ నవ్వుతూ ప్రారంభించాం’ అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా విజయ్ మాట్లాడుతూ.. ‘అయితే షూటింగ్ చివరిలో సమంత ఆరోగ్యం దెబ్బతింది. తొలుత తను అనారోగ్యానికి గురైందంటే నేను నమ్మలేదు, యూనిట్ అంతా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాం. అయితే, ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితి అర్ధమైంది. కొద్దిరోజులు రెస్ట్ తీసుకోమని చెప్పాం. ఈ క్రమంలో సమంత చికిత్స సమయంలో ఎంతో పెయిన్ అనుభవించింది. అయితే.. సమంత ఆరోగ్యం గురించి నేను ఇక్కడ మాట్లాడాలని అనుకోలేదు. కానీ చాలా మంది ఇలాంటి వాటితో బాధపడుతున్నారు, నేను వాళ్లకు దైర్యం చెప్పాలి, అనారోగ్యంగా ఉన్నా కూడా మనం పని చేయగలం అని చెప్పాలి సమంత నాతో అన్నది. అందుకే ఈ విషయం గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదలయ్యాక.. సమంత ముఖంపై చూడాలని ఉంది’ అని పేర్కొన్నారు.
కాగా తెలుగు సినిమాలకు సంబంధించి ఒక మూవీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇలాంటి మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఈ సినిమాలోని పాటలను సింగర్స్ లైవ్ లో పాడారు. అలాగే ఇందులోని ఒక పాటకి విజయ్ దేవరకొండ, సమంత కలిసి డాన్స్ చేయడం విశేషం. దీంతో కార్యక్రమానికి వచ్చిన అభిమానుల కేరింతలతో ఆడిటోరియం హోరెత్తింది. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. కాగా శివ ఇంతకుముందు ‘నిన్ను కోరి’ మరియు ‘మజిలీ’ సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం విదితమే. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన మూవీ ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: