కెరీర్ ప్రారంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తన ఉంగరాల జుట్టుతో, అభినయంతో ఎంతో మంది యువతకు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే మధ్యలో కాస్త ఫ్లాప్స్ తో కెరీర్ డల్ అయినా ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ అయిపోయింది. ఈమధ్య కాలంలో రౌడీ బాయ్స్, కార్తికేయ2, 18 పేజెస్ ఇలా వరుసగా హిట్లను అందుకొని గా ఫుల్ ఫామ్ లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం మరో హిట్ సీక్వెల్ లో హీరోగా నటిస్తుంది. సిద్దూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ ను తీస్తున్నారు. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోగా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈసినిమాను సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాను కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త తెలుగు సినిమాకు అనుపమ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 2021 లో సినిమా బండి అంటూ ఒక చిన్న సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అందుకొని విమర్శకలు ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ తో అనుపమ కొత్త సినిమా చేయనుంది. అనుపమతో తన నెక్స్ట్ ఫిలిం అంటూ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు ప్రవీణ్. ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: