రెబల్ స్టార్ ప్రభాస్ తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు.నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న ప్రభాస్ ఈరోజు తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకొని సుప్రభాత సేవలో పాల్గొన్నాడు.ఇక ఈరోజు తిరుపతి లో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు ఈవేడుక ప్రారంభం కానుంది.ఈ ఈవెంట్ కు ప్రభాస్ తోపాటు సినిమా యూనిట్ అంతా హాజరుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరునుంది.ఈవెంట్ లో ఆదిపురుష్ రెండో ట్రైలర్ ను కూడా లాంచ్ చేయనున్నారు.యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈట్రైలర్ అదిరిపోనుందట.మరోవైపు ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో 170కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.ఆ లెక్కన సినిమా హిట్ కావాలంటే 300కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే ఈమొత్తం రాబట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్,సాంగ్స్..సినిమా పై అంచనాలను భారీగా పెంచేసాయి.
ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా సీత గా కృతి సనన్,లక్ష్మణుడిగా సన్నీ సింగ్,హనుమాన్ గా దేవదత్తే నాగే రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.అజయ్-అతుల్ సంగీతం అందించారు.సుమారు 500కోట్ల బడ్జెట్ తో టి సిరీస్,రిట్రో ఫిల్స్ ,యువి క్రియేషన్స్ నిర్మించిన ఈసినిమా ఈనెల 16న తెలుగు తోపాటు ఇతర భాషల్లో 2డితోపాటు 3డి లోకూడా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: