తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ రివాల్వర్ రీటా తో అలరించనున్నారు. హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వారిద్దరూ జంటగా దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది.ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే తన ఫిల్మ్ కెరియర్.. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూ లో కీర్తి మాట్లాడుతూ .. మహానటి చిత్రాన్ని ఓకే చేసినందుకు తనను కొందరు ట్రోల్ చేశారనీ ,ఆ సినిమా పూర్తయ్యాకే ఈ విషయం తనకు తెలిసిందనీ , తనపై వచ్చిన విమర్శలు పక్కనపెడితే సావిత్రమ్మ పాత్రలో నటించినందుకు చాలా గర్వంగా ఉందనీ ,మహానటి చిత్రంలో నటించేందుకు ముందుగా ఒప్పుకోలేదనీ , సావిత్రమ్మ పాత్రలో నటించేందుకు చాలా భయమేసిందనీ ,కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ ధైర్యాన్ని ఇస్తూ ప్రో త్సహించారనీ ,అలా మహానటి పూర్తిచేశాననీ , సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగెటివిటీపై పెద్దగా ఆసక్తి చూపననీ , అందుకే తన పై ట్రోల్స్, విమర్శలు రావుఅనీ , సావిత్రమ్మ బయోపిక్ లో నటించడం భయంగా అనిపించిందనీ , ఆమె కుమార్తెతో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నాననీ , ఎన్నో సవాళ్లు ఎదురైనా కూడా ఆ పాత్ర చేసినందుకు మాత్రం గర్వపడుతున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: