ప్రధాని మోడీ, క్రికెట్ గాడ్ సచిన్‌లతో వేదిక పంచుకోనున్న రామ్‌ చరణ్‌

Ram Charan To Share The Stage With PM Modi And Sachin Tendulkar

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్‌ సినిమాపైనే చర్చ జరుగుతుంది ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెల్చుకోవడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. సామాన్యుల నుంచి స్టార్ సెలబ్రిటీలు , రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్లమెంట్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ పై ప్రశంసలు దక్కాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ ఇండియా రాగానే సన్మానించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస్కార్‌ గెలుపుతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ హీరో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్‌ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి వేదిక పంచుకోనున్నారు. న్యూఢిల్లీ వేదికగా ఈనెల 17,18 తేదీల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇదే ఈవెంట్‌లో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌తో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసినందుకు మెగా పవర్‌స్టార్‌ని ప్రధాని మోడీ ఘనంగా సన్మానించబోతున్నారని సమాచారం. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో # RC15 మూవీ లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + five =