అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత కూడా వరుసగా విజయాలు అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఈ ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఆసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తెలుగులో ఖుషి సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన సినిమా చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A 100 of you went, made friends, memories and experiences which will stay ❤️
When I see your happy smiling emotional faces, I know why I do this! I love you all 🤗
Full Love,
Vijay Deverakonda. #Deverasanta2022 https://t.co/9mU3pqoejL https://t.co/IKcmbx9QCO— Vijay Deverakonda (@TheDeverakonda) February 27, 2023
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా దేవరశాంటా పేరుతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బహుమతులు అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే 2022 క్రిస్మస్ కానుకగా 100 మందిని పర్యటనకు తీసుకెళ్లనున్నట్టు చెప్పిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది కదా. దీనిలో భాగంగానే 100 మంది అభిమానులను మనాలి యాత్రకు పంపాడు. తాజాగా ఆ ట్రిప్ కి సంబంధించిన గ్లింప్స్ ని విజయ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అందులో, ట్రిప్ లో భాగమైన ఆనందం, విజయ్ మీద తమ ప్రేమ, కృతజ్ఞత, తమ జీవితం లో ఈ ట్రిప్ ఎంత ముఖ్యమో తెలియజేసారు పర్యటకులు. మొత్తం 100 మంది అభిమానులు వివిధ సాహసాలు చేస్తూ ఆనందంగా గడిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: