దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో కార్తి, తమన్నా జంటగా తెరకెక్కిన రోడ్ డ్రామా పైయా తమిళ మూవీ, తెలుగు వెర్షన్ ఆవారా మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికీ స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. అప్పుడప్పుడూ ఈ మూవీ పాటలను ఎక్కడో ఓ చోట వింటూనో, పాడుకుంటూనే ఉంటారు. దాదాపు 13 సంవత్సరాల తరువాత ఆవారా మూవీకి సీక్వెల్ చేయాలని దర్శకుడు లింగుస్వామి ప్లాన్ చేసినట్టు.. ఈ సీక్వెల్ లో కార్తీకి బదులుగా ఆర్య నటించనున్నట్టు, రీసెంట్గా కథ విన్న ఆర్య కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ క్యాబ్ డ్రైవర్కి, అందులో ట్రావెల్ చేసిన అమ్మాయికి మధ్య ఏర్పడ్డ బాండింగ్తో రూపొందిన ఆవారా మూవీ జర్నీ సౌత్ రీజన్ టు నార్త్ రీజన్కి సాగింది. ఇప్పుడు ఈ సీక్వెల్లో ఈ జర్నీని దర్శకుడు లింగుస్వామి దుబాయ్లో ప్లాన్ చేస్తున్నట్టు.. హీరో ఆర్య కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనున్నట్టు.. ఈ మూవీతో జాన్వీ సౌత్ కు పరిచయం అవుతున్నట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: