మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాలేజ్ రోజుల నుంచి నేను సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. సినిమాలకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని కనబరిచేవాడిని. బయట నుంచి మనం చూసే సినిమా ప్రపంచం వేరనే విషయం ఇక్కడికి వచ్చిన తరువాతనే అర్థమైంది. ఇక్కడ నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చేస్తుంటే కరెక్టు చేసేవారు లేరు .. గైడ్ చేసేవారు లేరు. ఈ విషయమే నన్ను కంగారు పెడుతుంటుంది. అందువలన ఎక్కడా ఏది తేడా కొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను అని తెలిపాడు.
కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియల్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: