ఇండియాలో మొదటిసారిగా విమానాశ్రయంలో సినిమా థియేటర్స్ ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి మల్టీప్లెక్స్ను ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేస్తున్నట్లు పివిఆర్ సినిమాస్ బుధవారం ప్రకటించింది. ప్రయాణికులకు అందుబాటులో PVR సినిమాస్ తన కొత్త ఏరోహబ్ మల్టీప్లెక్స్ను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించింది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మల్టీప్లెక్స్లో ఐదు స్క్రీన్స్ ఉంటాయి. మొత్తం1,155 మంది కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. విమానాశ్రయానికి వచ్చే, బయలుదేరే ప్రయాణీకులకు విమాన సేవలు ఆలస్యం అయినా, వెయిటింగ్ సమయంలో వారికీ ఎంటర్టైన్మెంట్ అందించడమే కాక విమానాశ్రయం చుట్టూ ఉన్న సాధారణ పరిసరాల్లోని సందర్శకులకు కూడా ఈ మల్టీప్లెక్స్ అందుబాటులో ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
PVR లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ మాట్లాడుతూ: తమిళనాడులో మరో మల్టీ ప్లెక్స్ ఎయిర్ పోర్ట్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషిస్తున్నామనీ.. కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతున్న వినోద దృశ్యాలకు అనుగుణంగా.. దేశంలోని ప్రతి ప్రాంతంలోని వినియోగదారులకు అద్భుతమైన సినిమా అనుభూతిని అందించడానికి మేము కట్టుబడి ఉన్నామనీ.. మన రోజువారీ జీవితంలో వినోదం అంతర్భాగంగా ఉంటుందనీ.. ట్రాన్సిట్ ప్రయాణీకులు తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సినిమాలు చూడటం కంటే మెరుగైన మార్గం మరొకటి లేదనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: