సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. ఇక మరో షెడ్యూల్ ను రీసెంట్ గానే మొదలుపెట్టారు. ఇక నాన్ స్టాప్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఆసక్తికమైన వార్త ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం త్రిమిక్రమ్ బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాను తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆ పాట ఎంతో స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే మలైకా, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్ లో చేసింది. ఇక ఆ సాంగ్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలిచింది. ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి త్వరలో దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీలీల కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్గా, నవీన్ నూలి ఎడిటర్గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: