గత ఏడాది రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వరుసగా పాన్ ఇండియా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రాధేశ్యామ్ తరువాత ఆదిపురుష్ సినిమాతో బిజీ ఆయిపోయాడు ప్రభాస్. ఇక ఆ సినిమా తో పాటు సలార్ సినిమాను కూడా అప్పుడే ప్రారంభించేశాడు. అయితే ముందు ఆది పురుష్ సినిమాను పూర్తి చేశాడు. ఆ తరువాత ఫుల్ ఫోకస్ ను సలార్ పై పెట్టేశాడు. ఈసినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా ఎలాంటి బ్రేక్స్ లేకుండా నిర్విరామంగా జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమాయానికి షూటింగ్ పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడ. ప్రస్తుతం హైదరాబాద్ లో సలార్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఈ షెడ్యూల్ ఓ వారం రోజుల పాటు అక్కడే జరగనుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు చిత్రంలోని నటీనటులపై కొన్ని సన్నివేశాలు షూట్ చేయనున్నారట. ఇక ఆతరువాత ఫిబ్రవరి నెలలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేపడుతారట. ఆ వెంటనే మార్చిలో క్లైమాక్స్ షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేపడుతారట. మరి అనుకున్న టైమ్ కు షూట్ ను పూర్తి చేయగలిగితేనే చెప్పిన రిలీజ్ టైమ్ కు సినిమా రిలీజ్ చేయగలరు.
కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: