టాలీవుడ్ టాలెండెట్ నటుల్లో అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా తను నుండి వచ్చిన సినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా హిట్ 2 ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు అడివి శేష్. ఈనేపథ్యంలోనే అడివి శేష్ బాహుబలి ఈవెంట్ లో జరిగిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలు సంగతేంటంటే.. బాహుబలి సినిమాలో అడివి శేష్ కూడా ఒక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఇక అప్పట్లో ఈసినిమా ఈవెంట్ లో అడివి శేష్ తన పంజా సినిమా గురించి మాట్లాడగా అది అప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ ను అడుగగా.. దానికి సమాధానంగా ఒక హీరో ఈవెంట్ లో మరో హీరో గురించి మాట్లాడకూడదని నాకు అప్పట్లో తెలీదు.. నేను పంజా సినిమా నిర్మాతలే మళ్లీ బాహుబలి సినిమా నిర్మాతలు అవ్వడం.. వారి సినిమాలోనే మళ్లీ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం అంతే అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు.
#AdiviSesh gives clarity about his speech at #Baahubali Audio Launch!!
Watch Full Interview on @TeluguFilmNagar 👉 https://t.co/HCeLWPkUTQ@AdiviSesh #Prabhas #PawanKalyan #HIT2 #TeluguFilmNagar pic.twitter.com/kaUHu65TQR— Telugu FilmNagar (@telugufilmnagar) December 2, 2022
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: