ఒకప్పుడు కామెడీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చి ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నరేష్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ ఈసారి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను డైరెక్టర్ గారు ఒక ఆర్టికల్ చదివి కథగా రెడీ చేసుకున్నారని.. ట్రైబల్ ప్రాంతాల్లో అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను గురించిన ఒక ఆర్టికల్ చదివి.. ఆ అంశాన్ని కథగా రెడీ చేసుకుని రూపొందించారు. ఈ కాలంలోను కనీస వసతి సౌకర్యాలు లేక ఆ ఏరియాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సినిమా 90 శాతం వరకూ మారేడుమిల్లిలోనే షూట్ చేశాం.. మా డైరెక్టర్ గారి టేకింగ్.. సినిమాటోగ్రఫీ .. ఆర్ట్ డైరెక్టర్ పనితనం.. శ్రీచరణ్ పాకాల సంగీతం .. పృథ్వీ కంపోజ్ చేసిన ఫైట్స్ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఈ రోజుల్లో కొత్తదనం ఉంటేనే సినిమా చూస్తున్నారు. అలాంటి కొత్తదనం ఉన్న సినిమా ఇది అంటూ చెప్పుకొచ్చారు. చూద్దాం మరి ఈసినిమా నరేష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.
కాగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: