అలనాటి సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు రీసెంట్ గానే మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఈయన తుది శ్వాస విడిచారు. దీంతో ప్రభాస్ కుటుంబం మాత్రమే కాదు.. తెలుగు సినిమా పరిశ్రమ కూడా శోకంలో మునిగిపోయింది. రీసెంట్ గానే ఆయన సంస్మరణ సభ కూడా నిర్వహించారు. ఇక ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించారు నందమూరి బాలకృష్ణ దంపతులు. బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర కృష్ణంరాజు ఇంటికి వెళ్లి కృష్ణంరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని పరామర్శించి.. రెబల్ స్టార్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని, నాన్నగారి సమయం నుంచి కృష్ణంరాజుని చూస్తూ పెరిగాను అంటూ సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు బాలకృష్ణ
కాగా కృష్ణంరాజు చనిపోయినప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 లో ఉన్నారు బాలకృష్ణ. అప్పుడు టర్కీ షెడ్యూల్ లో ఉన్నారు బాలకృష్ణ. అందుకే అప్పుడు ఆయన పార్థీవ దేహాన్ని చూడడానికి రాలేకపోయారు.
ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: