ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య , సమంత జంటగా తెరకెక్కిన ఏ మాయ చేసావె మూవీ 2010 ఫిబ్రవరి 26 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ఫిల్మ్ ఫేర్ , బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా గౌతమ్ మీనన్ నంది అవార్డ్స్ అందుకున్నారు. ఈ మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సమంత , నాగచైతన్య ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు తమిళ , తెలుగు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ముందుగా ఏ మాయ చేసావె మూవీ స్క్రిప్ట్ ను హీరో మహేష్ బాబు కు వినిపించగా ఆ కథ తనకు సూటవ్వదని ఆయన నో చెప్పారనీ , తామిద్దరి కాంబినేషన్ పై అభిమానులు చాల అంచనాలు పెట్టుకున్నారనీ , ఒక యాక్షన్ కథ తో తనను కలవమని చెప్పారనీ , అప్పడు నాగచైతన్య తో ఏ మాయ చేసావె మూవీని తెరకెక్కించగా ఘనవిజయం సాధించిందనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: