లైగర్ టీమ్ ఎమోషనల్

Charmee Kaur Gets Emotional,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Charmee Kaur,Actress Charmee Kaur,Charmee Kaur Emotional In Liger Movie Promotions,Liger Movie Promotions,Liger Movie,Liger Movie Promotions, Liger Telugu movie Promotions,Charmee Kaur Emotional Speech in Liger Movie Promotions

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారిపోయింది ఛార్మి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరీ-ఛార్మీ ఇద్దరూ కలిసి నిర్మించారు. ఇక ఇప్పుడు లైగర్ తో వచ్చేస్తున్నారు. పూరీ-ఛార్మి నిర్మించిన ఈసినిమాలో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆగష్ట్ 25న రిలీజ్ కానుండటంతో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే లైగర్ టీమ్ ఎమోషనల్ అయింది. ఈ సినిమా షూటింగ్ గురించి.. ఆర్ధిక ఇబ్బందులు గురించి, ప్రొడ్యూసర్ కు ఎలాంటి కష్టాలు ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఛార్మి కంటతడి పెట్టుకుంది. లాక్‌డౌన్‌లో డబ్బులు లేనప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్ వచ్చింది. జేబులో ఒక్క రూపాయి లేదు. అంతా భారీ ఆఫర్ రిజెక్ట్ చేసేందుకు దమ్ము కావాలి. అది నాకు పూరీ గారి వల్ల వచ్చింది..’ అంటూ ఛార్మి కన్నీళ్లు పెట్టుకుంది. ‘నీ కష్టం నాకు అర్థమైంది.. ఎన్ని సార్లు ఏడ్చి ఉంటావు..’ అని పూరీ అనగానే ఛార్మి ఏడ్చేసింది. దీంతో విజయ్, పూరీ కూడా ఎమోషనల్ అయ్యారు. సినిమా రిలీజ్ చేయాలి. కోవిడ్ టైమ్. ఆ తరువాత వద్దామంటే ముందు తీసిన సినిమాలు ఉన్నాయి. ఎన్నో కష్టాల తరువాత ఆగస్టు 25న మీ ముందుకు వస్తున్నాం. ఈ మొత్తం ప్రయాణంలో నాకు, పూరీ గారికి విజయ్ దేవరకొండ ఎంతో స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. ఎప్పుడు ఏదీ అడగకుండా మాకు అండగా నిలబడ్డాడు. విజయ్ వల్లే లైగర్ మూవీ పూర్తయింది. మేం లైగర్‌ కంటెంట్‌ను నమ్మినాం. తప్పకుండా విజయం సాధిస్తుంది..’ అని ఛార్మి అన్నారు.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను పలు పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.