వైజయంతీ బ్యానర్ అధినేత అశ్వినీదత్ తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఇప్పుడు ఆయన తనయలు ప్రియాంక దత్, స్వప్న దత్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి వారు కూడా తండ్రికి తగ్గ తనయలు అనిపించుకుంటున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం నుండి మహానటి లాంటి గొప్ప సినిమాను అందించారు. రీసెంట్ గా సీతారామం లాంటి అందమైన ప్రేమకథను నిర్మించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా “అన్నీ మంచి శకునములే” అన్న టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినీదత్ ఈసినిమా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేసేశారు. అక్టోబర్ 5వ తేదీన ఈసినిమా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. మరి చెప్పినట్టే ఆ డేట్ కే రిలీజ్ చేస్తారా లేక మార్చే ఛాన్స్ ఏదైనా ఉందా అనేది తెలియాలంటే అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగాస్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈసినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, గౌతమి, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: