లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఖైదీ, మాస్టర్ ఇక రీసెంట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇక ఫ్యాన్స్ కోసం ఎప్పటినుండో కమల్ నుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుండగా ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. లోకేష్ గనగరాజ్ ఓ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు అది కూడా సూర్య-కార్తితో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను సూర్య-కార్తి తో తీయాలని ప్లాన్ చేస్తున్నానని.. పృథ్విరాజ్-బిజూ మోహన్ పాత్రలను సూర్య-కార్తి లతో చేయించాలని తెలిపాడు. మరి ప్రస్తుతం అయితే లోకేష్ మళ్లీ విజయ్ తోనే సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈసినిమా తరువాత కార్తి తోనే ఖైదీ సినిమా సీక్వెల్ చేయనున్నాడు. మరోవైపు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ హక్కులు ఇప్పటికే వేరే ప్రొడక్షన్ హౌస్ సొంతం చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ ఈ రీమేక్ చేయలేని పరిస్థితే. మరి ప్లాన్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఏమైనా చేస్తాడేమో చూడాలి…
కాగా ఇదే సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ నటుడు రానా ప్రధానా పాత్రల్లో నటించాడు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: