లంక ఫణిధర్ సమర్పణలో నెక్స్ట్ జెన్ పిక్చర్స్ బ్యానర్ పై లంక శశిధర్ దర్శకత్వంలో సుమంత్ సైలేంద్ర, మేఘా ఆకాష్ జంటగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న చిత్రం “ఓం శ్రీ కనకదుర్గ” మూవీ పూజా కార్యక్రమాలను గురువారం హైదరాబాద్లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఈ మూవీ లో కనకదుర్గ అమ్మవారుగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. సీనియర్ నటుడు , నిర్మాత మురళీమోహన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అంబికా కృష్ణ.. తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత డి.యస్. రావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.., డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీడియా సమావేశంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఈ మూవీ లో చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాననీ , మంచి టైటిల్తో, మంచి మనసున్న మనుషులు నిర్మిస్తున్న ఈ చిత్రం.. యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాననీ చెప్పారు. ఓం శ్రీ కనకదుర్గ మూవీ నిర్మాత , దర్శకుడు లంక శశిధర్ మాట్లాడుతూ .. ఈ చిత్రం తన మొదటి చిత్రమనీ ,
మంచి కాన్సెప్ట్ ఉన్న కథ తో , భారీ గ్రాఫిక్స్ తో లవ్ &ఎంటర్ టైనర్ థ్రిల్లర్ తెరకెక్కనుందనీ , హైదరాబాద్ , విజయవాడ తదితర ప్రాంతాలలో చిత్రీకరణ జరిపి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: