గత ఏడాది కరోనా ప్రభావం ఉన్నా కూడా మూడు సినిమాలు రిలీజ్ చేశాడు యంగ్ హీరో నితిన్. అందులో రంగ్ దే, చెక్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. మాస్ట్రో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక ఈ ఏడాది తన నుండి వస్తున్న మొదటి సినిమా మాచర్ల నియోజకవర్గం. ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న ఈసినిమాను అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఇక ఈసినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తుండటం విశేషం. కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పాత్రతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఆగష్ట్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు, అభిమానుల సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు.. మీ అభిమానం, ప్రేమకి థ్యాంక్స్. మరో ఇరవై ఏళ్లు అయినా మీ కోసం నేను ఇలాగే కష్టపడతాను.. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి’’ అంటూ వ్యాఖ్యానించాడు.
కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: