“కలియుగ పాండవులు “(1986) మూవీ తో ఖుష్బూ , “ఆ ఒక్కటీ అడక్కు “(1992 ) మూవీ తో రంభ కథానాయికలుగా టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో స్టార్ హీరోలకు జంటగా నటించి , 90 లలో స్టార్ హీరోయిన్స్ గా రాణించారు. వీరిద్దరు మాత్రం భాషతో సంబంధం లేకుండా అక్కడ ఇక్కడ అన్నట్లుగా అన్ని చోట్ల కనిపిస్తూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకప్పుడు హీరోయిన్స్ మధ్య పోటీ ఉన్నా ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ అందరూ స్నేహితులుగా మారిపోయారు.రెగ్యులర్ గా కలుసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఖుష్బూ మరియు రంభ లు ఒక సందర్భంగా కలుసుకున్నారు. స్వయంగా ఖుష్బూ తన పిల్లలతో కలిసి రంభ ఇంటికి వెళ్లినట్లుగా తెలిపారు . అక్కడ రంభ తో మరియు తన పిల్లలతో సమయం గడిపినట్లుగా ఖుష్బు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హీరోయిన్ రంభ మరియు ఖుష్బూ ల సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: